వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 14వ రోజు షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 20 2017 7:43 PM

YS Jagan padayatra 14th day schedule  - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, బేతంచర్ల (కర్నూలు జిల్లా): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. 14వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9 గంటలకు షైక్‌షావలీ దర్గాను చేరుకొని డోన్‌ నియోజకవర్గం పార్టీ నేతలతో ముచ్చటించనున్నారు. ఉదయం 10 గంటలకు పాణ్యం నేతలతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12. 30 గంటలకు వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. 

మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్ల నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. మధ్యాహ్నం 3.3 గంటలకు బేతంచర్ల బస్టాండ్‌ సర్కిల్‌ లో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి కోలుములెపల్లి చేరుకొని.. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌ బస చేస్తారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement